- Advertisement -
ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్రైజర్స్ జట్టులో రెండు మార్పులు చేసినట్లు సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. షకీబ్ అల్ హసన్, దీపక్ హుడా స్థానంలో తనతో పాటు షాబాజ్ నదీం తుదిజట్టులోకి వచ్చినట్లు చెప్పాడు. తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కి సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఇదే. బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లపై పడిన ఏడాది నిషేధం నేటితో ముగిసింది. ఇప్పుడు వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఆడనుండటం ఆసక్తికరంగా మారింది.