ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఇవాళ ఆసక్తికరపోరు జరగనుంది. ఆదివారం కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ముంబై ఇండియన్స్తో చెన్నై తలపడనుండగా కోల్కతా నైట్ రైడర్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైతో తలపడనుంది చెన్నై. ఈ సీజన్లో ముంబై పెద్దగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడగా రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది ముంబై. ఇక చెన్నై మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా ఈ పోరులో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
చెన్నై టీంలో శివం దూబే, రహనే, గైక్వాడ్, ధోని, జడేజా పామ్లో ఉండగా ముంబైలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో బుమ్రా ఆ జట్టుకు ప్రదాన బౌలర్. దీంతో ఈ మ్యాచ్లోనూ భారీ స్కోరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో మ్యాచ్లో కేకేఆర్తో లక్నో తలపడనుండగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.