Friday, April 19, 2024
- Advertisement -

ధోనీ కొత్త అవతారం మిస్టరీ వీడింది!

- Advertisement -

టీమిండియా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కొత్త అవతారం చూసి అభిమానులు నివ్వెరపోయారు. బౌద్ధ సన్యాసిలా దర్శనమిస్తున్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఎప్పుడూ స్పోర్టీ లుక్ తో కనిపించే ధోనీ అకస్మాత్తుగా సన్యాసి వేషంలో కనిపించడమేంటో అర్థంకాక అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. అంతే కాదు దీనిపై నెటిజన్లు, ఫ్యాన్స్ రక రకాలుగా తమ అభిప్రాయాలు వెల్లుబుచ్చారు.

అయితే ధోనీ వెనుక సీక్రెట్ ఏంటా అని అందరూ తలలు బాదుకుంటున్న సమయంలో మొత్తానికి ఆ మిస్టరీ వీడిపోయింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ అవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్, టోర్నీ స్పాన్సర్ వివో, ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రోమో వీడియో రూపొందించాయి.

రోహిత్ శర్మ వంటి అత్యధిక ఐపీఎల్ టోర్నీ విజయాలు అందుకున్న కెప్టెన్ గురించి సన్యాసి వేషంలో ఉన్న ధోనీ… తన శిష్యులకు వివరించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.  అంతే కాదు ఇందులో ఐపీఎల్ విశిష్టతను తెలియజేసే విధంగా ఈ వీడియో రూపొందించారు. మొత్తమ్మీద తనదైన కూల్ నెస్ తో ధోనీ ఈ యాడ్ ను రక్తికట్టించాడనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -