టీమిండియా మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి వెటరన్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ అంటే.. ధోనీకి తన కూతురు జీవా పుట్టిన విషయంను అతని భార్య సాక్షి.. సురేశ్ రైనా ద్వారానే అతనికి తెలియజేసింది. 2015 వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్కి ధోనీ తన ఫోన్ ని తీసుకెళ్లలేదు.
దాంతో రైనాకి ఫోన్ చేసిన సాక్షి.. గుడ్ న్యూస్ ని ధోనీకి చెప్పాలని కోరిందట. అంతలా ధోనీతో పాటు అతని ఫ్యామిలీకి కూడా రైనా చాలా క్లోజ్. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి సురేశ్ రైనా ఏమన్నాడంటే.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతుండగా.. ‘‘ ధోనీ రిటైర్మెంట్ ప్రణాళికల గురించి నీకుమైనా ఐడియా ఉందా ?” అని చోప్రా ప్రశ్నించగా.. రైనా జవాబు ఇస్తూ.. ” రిటైర్మెంట్ అనేది ధోనీ పర్సనల్. ఆ విషయంను నేను అడగను. అయినా ధోనీ ఇప్పటికి మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కొత్త తరహా షాట్స్ ఆడుతున్నాడు.
అతని మనసులో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు ?” అని చెప్పుకొచ్చాడు. ఇక ధోనీ కెఫ్టెన్ గా ఉన్నప్పుడు టీంలో రైనాకు స్థానం ఉండేది. కానీ విరాట్ కోహ్లీ కెఫ్టెన్ గా మారిన తర్వాత రైనా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. అయితే.. ఐపీఎల్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సుదీర్ఘకాలంగా ధోనీతో కలిసే రైనా మ్యాచ్లు ఆడుతున్నాడు.