Wednesday, May 8, 2024
- Advertisement -

కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్‌కు ఫిదా అయ‌న భార‌తీయులు..

- Advertisement -

అచ్చమైన మాతృభాషలో మాట్లాడటం.. రాయడం కూడా ప్ర‌స్తుతం కష్టమైపోతోంది. ఎందుకంటే ఆంగ్ల భాష వ్యామోహంలో పడి మాతృభాషను మర్చిపోతున్నామని పలువురు భాషా ప్రేమికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసందే. భారత్‌లోని అన్ని భాషల్లోనూ ఆంగ్ల పదాలు చొచ్చుకుపోయాయి. రోజువారీ జనజీవితంలో ఆంగ్ల‌ప‌దం వాడ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. కాని ప‌ర‌దేశీ ఆట‌గాడు పీట‌ర్స‌న్ ఒక్క ఆగ్ల‌ప‌దం కాకుండా అచ్చ‌మైన హీందీలో చేసిన ట్వీట్‌కు భార‌తీయులు ఫిదా అయిపోయారు.

కజిరంగా జాతీయ పార్కులో రైనోల సంఖ్యను లెక్కించేందుకు గజరాజులను వాహనాలు చేసుకున్న ఫోటోను పంచుకున్న పీటర్సన్… రైనోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం తనకు ఆనందం కలిగిస్తోందని, భారతీయులన్నా, భారత్‌ లోని జంతుజాలమన్నా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. దీంతో ఫిదా అయిన క్రికెట్ ప్రేమికులు… భారతీయులు కూడా ఇంత స్వచ్ఛంగా హిందీలో రాయలేరని పేర్కొంటున్నారు. మనకంటే కెవినే బెటరని, ఒక్క ఆంగ్ల పదం లేకుండా ట్వీట్ చేశాడని మెచ్చుకుంటున్నారు.

అతని ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 3వేలమంది రీట్వీట్‌ చేశారు. 12వేలమందికిపైగా లైక్‌ చేశారు. భారతీయులు కూడా ఇలా ఒక్క ఆంగ్ల పదం లేకుండా రాయలేరని, మన కన్నా కెవిన్‌ బెటర్‌ అని నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -