ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్.. ముందుగా కేకేఆర్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్లాడిన కోల్కతా జట్టు ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి ఐదో స్థానంలో ఉంది. సీజన్లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ తప్పక గెలవాల్సి ఉంది.
కోల్కతా నైట్రైడర్స్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్మాన్ గిల్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, జావోన్ సీర్లెస్, పీయూష్ చావ్లా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
కింగ్స్ పంజాబ్
అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అరోన్ ఫించ్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, బరీందర్ శ్రాన్, ముజిబ్ ఉర్ రహ్మాన్