త్వరలో జరిగే వరల్డ్ కప్కు స్పిన్నర్ అశ్విన్ దూరం కానున్నారు. తాజాగా టీమ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. జట్టులో నంబర్ వన్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది కుల్దీప్ యాదవేనని కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల కంటే కూడా కుల్దీప్కే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మ్యాచుల్లో కుల్దీప్ రాణిస్తున్నాడని ప్రశంశలు కురిపించారు. అతనికే మా మొదటి ప్రాధాన్యత. టెస్ట్లో అద్భుతంగా ఆడుతూ.. ఐదు వికెట్లు తీస్తున్నాడు. ఒకవేళ మాకు ఒకే స్పిన్నర్ని తీసుకొనే అవకాశం ఉంటే కచ్చితంగా అతన్నే తీసుకుంటాం’’ అని శాస్త్రి అన్నారు. అయితే ప్రతీ ఒక్కరికీ సమయం కచ్చితంగా వస్తుందంటూ అశ్విన్ను ఉద్దేశించి మాట్లాడాడు. 2018లో ఫిట్నెస్ రికార్డు సరిగా లేకపోవడం వల్లే అతను జట్టుకు దూరమయ్యాడన్నాడు.