ఈ ఐపీఎల్ సీజన్లో క్రిస్ గేల్ పరుగుల వరదను పారిస్తున్నారు. టి20ల్లో తానెంతటి విశిష్ట ఆటగాడో చాటుతూ, తనను తీసుకోకపోవడం ఎంత తప్పో ఇతర జట్లకు చెబుతూ, తన బ్యాట్ పదును తగ్గలేదని చూపుతూ… అతడు విరుచుకు పడ్డాడు.
సన్రైర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గేల్ పరుగుల సునీమీని సృష్టించారు. మొదటి మ్యాచ్లో చెన్నై హాఫ్ సెంచరీ చేసిన గేల్.. తర్వాతి మ్యాచ్లో ఏకంగా (104 నాటౌట్: 63 బంతుల్లో 1ఫోరు, 11సిక్సర్లు) తో శతకం బాదేశాడు. రెండు మ్యాచ్ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గేల్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ 4 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. దీంతో పంజాబ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. గేల్ సునామీ ప్రత్యర్థిని చుట్టు ముట్టిన వేళ.. యువరాజ్ సింగ్ గంగ్నమ్ స్టయిల్ స్టెప్పులతో అదరగొట్టాడు.
పంజాబ్ ఇన్నింగ్స్లో గేల్ సెంచరీ పూర్తి చేయడంతో అందరికన్నా ఎక్కువ సంతోష పడింది మాత్రం ఆ జట్టు ఆటగాడు యువరాజ్సింగ్. మైదానంలో తనదైన శైలిలో గేల్ సంబరాలు చేసుకుంటే.. డగౌట్లో ఉన్న యువీ ఫేమస్ డ్యాన్స్ గంగ్నం స్టెల్ డ్యాన్స్తో ఆకట్టుకున్నాడు. గేల్ సునామీకి తన డ్యాన్స్తో అభినందనలు తెలిపాడు. ఇది చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. తను ఎంతటి విలువైన ఆటగాడినో మరో సారి నిరూపించుకున్నారు కరేబియన్ వీరుడు.