Tuesday, May 14, 2024
- Advertisement -

శ్రీదేవి చివరి సినిమా ‘మామ్’ కాదు?

- Advertisement -

సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా…నీవాడు ఎవరే? నీతోడు ఎవరే? ఎన్నాళ్లకొస్తాడే?’ అంటూ ఒకతరం గుండెల్ని గిలిగింతలు పెట్టిన వెండితెరవేల్పు శ్రీదేవి చివరగా నటించి మెప్పించిన సినిమా ‘మామ్’ అన్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆమె చివరి సినిమా కాదని బాలీవుడ్ సమాచారం.

ఆమె చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘జీరో’ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పూర్తి స్థాయి పోషించనప్పటికీ…చివరి సారి ఆమె ప్రేక్షకులను పలకరించేది మాత్రం ఈ సినిమాతోనేనని సమాచారం.

జీరో సినిమాలో ఆమె నిజజీవిత పాత్రలోనే (స్టార్ హీరోయిన్ శ్రీదేవిగా) కనిపించబోతున్నారట. ఓ పార్టీ సీన్‌ గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్‌ లతో కలిసి ఆమె సందడి చేస్తారని, దీనికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తైందని బాలీవుడ్ కథనాలు పేర్కొంటున్నాయి.

డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, రాయ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీంతో శ్రీదేవి చివరి సినిమా ‘మామ్’ కాదు’జీరో’ అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -