పిచ్చి పలు రకములు అంటారు. కొంత మంది పాపులారిటీ కోసం ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పాపులర్ కావడానికి సెలబ్రటీల నుంచి సామాన్యుల వరకు నానా తిప్పలు పడుతున్నారు. ప్రముఖ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ పై కేసు నమోదైంది. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బీచ్ లో ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా నగ్నంగా పరుగెత్తాడు. ఇదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఈ సీన్లు ఆయన భార్య ఫోటోలు తీసింది.
ఈ ఫొటోలను మిలింద్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మిలింద్ తనకు తానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాడు. 1990లో టఫ్ షూస్ అనే యాడ్ కోసం మాజీ మిస్ ఇండియా మధు సప్రితో కలిసి నగ్నంగా ఫొటో షూట్ లో మిలింద్ పాల్గొనడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాల్ పోస్ట్ చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, జనాలు ఉన్న చోట మిలింద్ నగ్నంగా పరిగెత్తడం నేరమని, ఆయనపై ఐపిసి సెక్షన్ 294 ప్రకారం కొల్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు దక్షిణ గోవా ఎస్ పి పంకజ్ సింగ్ తెలిపారు.
మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!
ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?