- Advertisement -
మహింద్ర సింగ్ ధోని భారత క్రికెట్లో ఈ పేరు పెను సంచనలం సృష్టించిందనే చెప్పాలి. తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు ధోని. వన్డేల్లో పదివేల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 10,000 పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్ ధోని నిలవడం విశేషం. ధోని కన్నా ముందు శ్రీలంక వికెట్ కీపర్ సంగర్కర వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేశాడు.
భారత్ తరఫున పది వేల పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్మన్ మహి కావడం మరో విశేషం. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (18426), సౌరవ్ గంగూలీ (11363), రాహుల్ ద్రవిడ్ (10889) తర్వాత పదివేల మైలురాయిని అందుకున్న నాలుగో బ్యాట్స్మన్ ధోని.కాని ఈ మ్యాచ్లో బారత్ ఓడిపోవడం ధోని అభిమానులకు కాస్తా భాద కలిగించింది.