ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు ముంబయ్ ఇండియన్స్ చెప్పుకోతగ్గ ఆటతీరును ప్రదర్శించలేదు. ఆరు మ్యాచ్లాడిన చెన్నై జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పేలవ రీతిలో ఐదింట్లో ఓడిన ముంబయి జట్టు చివరి స్థానంలో ఉంది.
ముంబయి జట్టుకు టోర్నీలో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. తప్పకుండా.. మిగిలిన 8 మ్యాచ్ల్లోనూ సత్తాచాటాల్సి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో రోహిత్ సేన ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.
ముంబయి ఓపెనర్లు ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ జట్టుకి మెరుగైన ఆరంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్ అంచనాల్ని అందుకోలేకపోతోంది. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్య, పొలార్డ్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. బౌలింగ్ విభాగంలోనూ… స్పిన్నర్ మార్కండే మాత్రమే రాణిస్తున్నాడు.