క్రికెటర్ మొహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ ఎన్నో ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆమె ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. షమీ కెరీరే ప్రమాదంలో పడింది. ఇప్పుడు అనూహ్యంగా భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు షమీ .
హసీన్ జహాన్కు ఇప్పటి వరకే పెళ్లి అయ్యిందని పశ్చిమ బెంగాల్కు షేకీ సైఫుద్దీన్ అనే వ్యక్తి ఆమె మాజీ భర్తనంటూ మీడియా ముందుకు వచ్చారు. హసీన్ జహాన్ తన మాజీ భార్య అని, ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బర్భమ్, సియూరిలో కొంత కాలం కాపురం చేసామన్నారు. ఇద్దరు పిల్లుల ఉన్నారని తెలిపారు.
షమీ కూడా ఇదే ఆరోపనలు చేశారు. తనను పెళ్లి చేసుకునే సమయానికే హసీన్ కు పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. ఆ విషయాన్ని తన వద్ద ఆమె దాచి పెట్టిందని తెలిపాడు. పిల్లలు ఎవరని అడిగితే, చనిపోయిన తన సోదరి పిల్లలు అని చెప్పిందని అన్నాడు. ఆమె చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి, ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి తనకు అసలు విషయాన్ని చెప్పిందని తెలిపాడు. తనకు పెళ్లి అయిందని, ఆ ఇద్దరు పిల్లలు తన పిల్లలే అని చెప్పిందని… దాంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు.
హసీన్ జహాన్ విషయానికి వస్తే, 2002లో ఫషీయుద్దీన్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో 2010లో విడిపోయారు. 2012లో షమీతో పరిచయం ఏర్పడింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప ఉంది. ఇప్పుడు వీరి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.