Tuesday, May 14, 2024
- Advertisement -

ధోని దేశ భ‌క్తికి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి భారత ఆర్మీ అంటే ఎనలేని గౌరవం. క్రికెట్‌ అభిమానుల మాదిరిగానే ఇండియన్‌ ఆర్మీకీ అతనంటే ప్రత్యేకమైన అభిమానం అన్న సంగ‌తి తెలిసిందే. ఇదలా ఉంటె
సౌంతాప్ట‌న్‌లో స‌ఫారీల‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను ధ‌రించిన గ్లౌజ్‌లు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. త‌న‌లో ఉన్న దేశ‌భ‌క్తిని మ‌రోసారి చాటాయి.

ఈ మ్యాచ్‌లో ధోనీ.. ముదురు ఆకుప‌చ్చ‌ క‌ల‌ర్‌లో ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించాడు. అయితే ఆ కీపింగ్ గ్లౌజ్‌ల‌పై ఓ చిహ్నం ఉంది. అది పారామిలిట‌రీ ద‌ళాల‌కు చెందిన గుర్తు. దాన్ని బ‌లిదాన్ బ్యాడ్జిగా పిలుస్తారు. 2011లో ధోనికి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఇచ్చి ఇండియన్‌ ఆర్మీ గౌరవించిన సంగతి తెలిసిందే. భారత పారామిలటరీ దళంలో పనిచేయడమంటే తనకెంతో ఇష్టమని ధోని పలు సందర్భాల్లో వెల్లడించారు.

లిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించిన ధోనీకి.. ట్విట్ట‌ర్‌లో అభిమాన‌లు సెల్యూట్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో వ‌న్డేలో ధోనీ 34 ర‌న్స్ చేశాడు. ఇక ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2019ని ఘనంగా ఆరంభించిన కోహ్లిసేన దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. 227 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో ఛేదించింది. కోహ్లీసేన త‌న త‌రువాత మ్యాచ్‌ను జూన్ 9వ తేదీన ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న‌ది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -