Tuesday, April 30, 2024
- Advertisement -

ముంబైకి తప్పని ఓటమి..

- Advertisement -

ఐపీఎల్ 2024లో ముంబైని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. తాజాగా హోం గ్రౌండ్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 125 పరుగులకే 9 వికెట్లు కొల్పోయింది. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలడంతో ముంబై భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది.

అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్..15.3 ఓవర్లలో 126 పరుగులు చేసి విజయం సాధించింది. యశస్వి జైశ్వాల్‌ 10,జోస్ బట్లర్‌ (13), సంజూ శాంసన్‌ (12) విఫలమైన రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచి రాజస్థాన్‌ని గెలిపించాడు. ఈసారి సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రియాగ్ …. ఆరెంజ్‌ క్యాప్ సాధించాడు. ఈ విజయంతో రాజస్థాన్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదుచేయగా ముంబై ఇండియన్స్ మూడో ఓటమిని చవి చూసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -