Friday, May 10, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబ‌య్‌…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది . సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీని ఆరంభించిన హైదరాబాద్ జట్టు.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ అనూహ్యంగా ఓటమి చవిచూసింది.

దీనికి తోడు టీమ్‌కు గాయాల బెడ‌ద వెంటాడుతోంది. వెన్నునొప్పి కారణంగా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమవడం సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెంచుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే జట్టు బ్యాటింగ్ భారాన్ని మెస్తుండగా.. మనీశ్ పాండే, దీపక్ హుడా, షకీబ్ అల్ హసన్ పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నారు. మ్యాచ్‌కు దూర‌మ‌యిన ధావ‌న్ జ‌ట్టులోకి రావ‌డం క‌ల‌సి వ‌చ్చే అంశం.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీని ఆరంభించిన ముంబయి ఇండియన్స్‌ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాల్లింటిలో ఓడి.. ఢీలా పడింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లావిస్ ఫామ్‌లో ఉండగా.. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నారు. హిట్టర్ పొలార్డ్ కనీసం ఈ మ్యాచ్‌తోనైనా ఫామ్‌లోకి రావాలని ముంబయి ఆశిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -