- Advertisement -
అఖరికి ఓ వ్యక్తి నేను బ్రతికే ఉన్నాను అని ప్రకటించికోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ నాథన్ మెక్కలమ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది అభిమానులు అతనికి నివాళి అర్పిస్తూ పోస్టులు కూడా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మెక్కలమ్ కంగుతిన్నాడు.
తాను జీవించే ఉన్నానని స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. న్యూజిలాండ్ తరుపున మెక్కలమ్ చాలా మ్యాచ్లు ఆడాడు. సుదీర్ఘ కెరీర్లో 84 వన్డేలు, 63 టీ20లు ఆడాడు. ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మ్యాచ్లు ఆడాడు. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెక్కలమ్ సోదరుడే ఈ నాథన్ మెక్కలమ్.