- Advertisement -
ఈ నెల 22 నుంచి భారత్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికె న్యాజిలాండ్ ఆటగాల్లు భారత్ చేరుకున్నారు. వచ్చే ఆదివారం మొదటి వన్డే ముంబయిలోని వాఖెడె స్టేడియంలో జరగనుంది.
అయితె వన్డే మ్యాచ్లు ప్రారంభం కాకముందె ఆదిలోనె న్యూజిలాండ్కు ఎదురు దెబ్బ తగిలింది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన సన్నాహక మ్యాచ్లో కివీస్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్ గాయపడ్డాడు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
దీంతో ఆయన మూడు వన్డే సిరీస్లకు దూరమయ్యారు. ఆస్టల్ స్థానంలో జట్టులోకి ఇష్ సోధీని తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ జట్టు ప్రకటించింది. ఈ నెల 25న రెండో వన్డే, 29న మూడో వన్డే జరగనుంది.