Tuesday, May 7, 2024
- Advertisement -

ధోనీని త‌ప్పించారా…? లేకా నిజంగానే విశ్రాంతినిచ్చారా…?

- Advertisement -

శ్రీలంకలో మార్చి 6 నుంచి జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీ కోసం జట్టును ఎంపిక చేసింది మేనేజ్‌మెంట్‌. అయితే చాలా మందికి విశ్రాంతి నిచ్చారు. వారిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకూడా ఉన్నారు. అయితే ధోనీని త‌ప్పించారా లేకా నిజంగానే ఒప్పించారా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

15 మంది సభ్యులతో కూడిన జట్టుని ఆదివారం ప్రకటించిన భారత సెలక్టర్లు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌కి విశ్రాంతినిచ్చినట్లు వెల్లడించారు. వారి స్థానంలో యువ క్రికెటర్లకి ఛాన్సిచ్చి.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ని నియమించారు.

దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడి భారత సీనియర్ క్రికెటర్లు అలసిపోయారని.. రానున్న ఐపీఎల్, ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో వారికి రెస్ట్ ఇచ్చామని సెలక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ.. ఈ జాబితాలో మహేంద్రసింగ్ ధోనీ పేరు ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు కదా..? అతను అలసిపోవడమేంటి..? ఒకవేళ అదే అనుకుంటే.. సఫారీ గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను ఎందుకు ఎంపిక చేశారు..? అనేది ఇప్పుడీ ప్ర‌శ్న‌.

మహేంద్రసింగ్ ధోనీనే తనకి విశ్రాంతి కావాలని కోరాడు’ ఇది జట్టుని ప్రకటించిన అనంతరం సెలక్టర్లు చెప్పిన మాట. గత ఏడాది ఇదే తరహాలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజాలకి రెస్ట్ కావాలంటే.. ఇచ్చామని.. వన్డే, టీ20 జట్టు నుంచి వాళ్లని సెలక్టర్లు తప్పించారు. ఆ తర్వాత ఈ స్పిన్ జోడి జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలే లేకపోయాయి. ఇప్పుడు ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లని జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ ఈ టోర్నీలో ఎవరైనా మెరుగ్గా రాణిస్తే..? 2019 ప్రపంచకప్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఉపయోగపడతాడనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారేమో..?

మరోవైపు ధోనీ మునుపటిలా ఆడలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. సెలక్టర్లు వికెట్ కీపర్ వేటలో పడ్డారన్న వాదనలకి తాజా సెలక్షన్ కూడా బలం చేకూరుస్తోంది. గత ఏడాది ఆరంభంలోనూ వన్డే, టీ20 కెప్టెన్సీలను ధోనీనే స్వతహాగా వదులుకున్నాడని చెప్పారు.. కానీ.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రత్యేకంగా ధోనీతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే.. పరోక్షంగా ధోనిని ఒప్పించినట్లు.. ఇప్పుడు కూడా అదే తరహాలో ధోనిని ఒప్పించారా..?

రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్‌ను అందించాలని ధోనీ బలంగా కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతనికి ఎక్కువగా ప్రాక్టీస్ కూడా లభించలేదు. సెలక్టర్ల మాటతో వెనక్కి తగ్గి.. విశ్రాంతి కోరుకున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -