- Advertisement -
ఒక వైపు ఎన్నికల ప్రచారం …మరో వైపు నేతల నోటినుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఆప్, బీజేపీ నుంచి గౌతమ్ గంభీర్ మధ్య వివాదం ముదురి పాకాన పడుతోంది. ఒకరిమీద ఒకరు సవాల్లు ప్రతిసవాల్లు చేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పాంప్లెట్లను పంచిపెట్టడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు.
ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటాను.. లేదంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయాల నుంచి వైదలగాలి. నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?’ అని అరవింద్ కేజ్రీవాల్కు గంభీర్ సవాల్ విసిరాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే పోటీ నుంచి తప్పుకుంటానని గంభీర్ గురువారం ట్వీట్ చేశాడు. తనపై తప్పుడు ఆరోపనలు చేస్తున్నారని వారిపై పరువు నష్టం దావా వేస్తానని గంభీర్ హెచ్చరించారు.