Tuesday, May 14, 2024
- Advertisement -

కాశ్మీర్ విష‌యంలో భార‌త్‌కు వ్య‌తిరేకంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన పాకిస్థాన్ క్రికెట‌ర్ అఫ్రీది…

- Advertisement -

స‌మ‌యం దొరిన‌పుడ‌ల్లా కాశ్మీర్ విష‌యంలో భార‌త్‌పై విష‌యం క‌క్కే పాక్ జాడ్యం ఇప్పుడు ఆ దేశ క్రికెట‌ర్‌ల‌కు పాకింది. తాజాగా కాశ్మీర్ విష‌యంలో పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. భారత్‌పై విషం చిమ్ముతూ… కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. భారత్ ఆక్రమించిన కాశ్మీర్‌లో ఏదో కల్లోలం జరుగుతుందంటూ మొసలి కన్నీరు కార్చాడు.

స్వేచ్ఛ‌ను కోరుకుంటున్న కశ్మీరీల నోళ్లను మూయించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పాడు. భారత్ ఆక్రమిత కశ్మీర్ లో ఇంత హింస చోటు చేసుకుంటున్నా… ఐక్యరాజ్యసమితి కాని, ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించాడు. కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న రక్తపాతాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని అన్నాడు.

అఫ్రిది వ్యాఖ్యలకు ఫ్యాన్స్ నుంచి కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి. ముందు మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంగతి చూసుకోమంటూ సెటైర్లు పేలాయి. అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంత కొత్తేమీ కాదు. 2016 టీ-20 వరల్డ్2కప్ సమయంలో ఇలాగే కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తిస్తూ భారత్‌ను టార్గెట్ చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -