Tuesday, May 7, 2024
- Advertisement -

నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్…45/2…ఎట్ట‌కేల‌కు ప‌రుగుల ఖాతా తెర‌చిన పుజారా

- Advertisement -

సౌతాఫ్రికాతో జొహ‌నెస్ బ‌ర్గ్‌లో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా నిల‌క‌డ‌గా ఆడుతోంది. అదిలోనే రాహుల్‌, ముర‌ళీ విజ‌య్ వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ఇండియాను కెప్టెన్ కోహ్లీ, పుజారా ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పెంచుతున్నారు. కోహ్లీ 24, పుజారా 5 ప‌రుగుల‌తో క్రీజులో ఆడుతున్నారు.27 ఓవ‌ర్లు ముగిసె స‌మ‌యానికి భార‌త్ 45 /2 వికెట్ల‌తో ఉంది.

మూడో టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌటవడంతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా 22వ ఓవర్‌లో తన పరుగుల ఖాతా తెరిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సుమారు 90 నిమిషాల పాటు.. 54 బంతులు ఎదుర్కొన్న పుజారా.. ఎట్టకేలకి పరుగుల ఖాతా తెరవడంతో భారత జట్టు డగౌట్‌లో సరదా వాతావరణం నెలకొంది. శిఖర్ ధావన్ పడిపడి నవ్వగా.. అజింక్య రహానె ముసిముసిగా నవ్వుతూ కనిపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -