Friday, May 3, 2024
- Advertisement -

నాకు ఫైన‌ల్ ఫోబియాలేదు..భ‌విష్య‌త్తులో క‌శ్చితంగా స్వ‌ర్ణం సాధిస్తా…పీవీ సింధు

- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఫైనల్స్ లో మారిన్ కు తొలి రౌండ్ లో గట్టి పోటీని ఇవ్వగలిగానని చెప్పింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గట్టి ప్రత్యర్థులే ఉంటారని… విజయం కోసం ప్రతి ఒక్కరు శ్రమిస్తారని తెలిపింది.

అందరూ నాకు ఫైనల్ ఫోబియా అంటున్నారు. నాకు ఫైనల్‌ ఫోబియా లేదు. ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఫైనల్లో కూడా గెలవాలనే ఆడా.. స్పెయిన్ స్టార్ కరోలినా మారీన్ తెలివిగా ఆడింది. తొలి రౌండ్ నుంచి కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాను. ఫైనల్లో ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. చాలా బాగా ఆడిన మారిన్‌కు అభినందనలు. ఛాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. ఈ ఏడాది రజతం సాధించాను..కచ్చితంగా భవిష్యత్‌లో స్వర్ణం కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది.

ఫైనల్స్ లో ఓడిపోయానని బాధపడనని, మరో పతకం వచ్చిందని సంతోషిస్తానని తెలిపింది. తాను ఫైనల్స్ కు వచ్చి ఓడిపోతున్నానని కొందరు అంటున్నారని, కానీ ఫైనల్స్ కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలని చెప్పింది. వచ్చే ఏడాది తాను స్వర్ణ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

తుదిపోరులో ఎవరైనా బాగా ఆడాలనే అనుకుంటారు. కొన్ని సార్లు ఆడొచ్చు లేక ఆడకపోవచ్చు. ఓడిపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని రానున్న టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా అంటూ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -