Tuesday, April 30, 2024
- Advertisement -

ఆర్సీబీ,ముంబై..ఫ్యాన్స్ నిరాశే!

- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో వరెస్ట్ పర్ఫామెన్స్‌తో నిరాశ పరుస్తున్నాయి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది ముంబై. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. హోం గ్రౌండ్స్‌లోనూ నిరాశ పరుస్తున్నాయి ఈ రెండు జట్లు. పాయింట్ల పట్టికలో చివర్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు ఉన్నాయి.

ముంబై యాజమాన్యం కెప్టెన్‌ను మార్చిన ఫలితం లేకపోగా ఆర్సీబీలో కేవలం కోహ్లీ ఒక్కడే రాణిస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్‌ని నిరాశ పరుస్తూ ఓటమి పాలవుతున్నాయి ఈ రెండు జట్లు. ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఊహించని విధంగా సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో అత్యద్భుతంగా రాణిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ టాప్ లో ఉండగా, రెండో స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్, మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో స్థానంలో లక్నో, ఐదో స్థానంలో హైదరాబాద్ జట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ మద్యాహ్నం 3:30 కి ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ తలపడనుండగా రాత్రి 7:30 లక్నోతో గుజరాత్ తలపడనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -