- Advertisement -
టీమిండియాలో దాదాపు ధోని రిటైర్మెంట్ తీసుకున్నట్టే. అయితే ధోని వారసుడిగా రిషబ్ పంత్ పేరు తెచ్చుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు కూడా మిస్టర్ కూల్ స్థానాన్ని పంత్ మాత్రమే భర్తీ చేయగలడని తెలిపారు. విండీస్ టూర్ నుంచి ధోని తప్పుకోవడంతో పంత్కు బంగారు అవకాశం లభించింది. అన్ని ఫార్మెట్లకు కీపర్గా పంత్ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ధోని స్థానంలో ఆడటంపై పంత్ స్పందించారు.
ధోనీ స్థానంలో ఆడటం అంత సులువు కాదు. అది పెద్ద బాధ్యత. దాని గురించి ఆలోచిస్తే నాకు పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం నేను అభిమానుల మాటలు పట్టించుకోవట్లేదు. నేనేం చెయ్యాలనే విషయంపైనే ఆలోచిస్తున్నా. దేశం కోసం అత్యుత్తమంగా ఆడాలని మాత్రమే అనుకుంటున్నా. అదొక్క విషయంపైనే నేను దృష్టిసారించానని తెలిపారు.