విండీస్ టూర్ లోను ప్రస్తుతం స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్ లోను పంత్ ఘోరంగా విఫలం అవడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. కెప్టెన్ కోహ్లీ, కోచ్ ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా తన బ్యాటింగ్ తీరును మార్చుకోలేకపోతున్నాడు. పంత్ న పక్కన పెట్టాలని అతని స్థానంలోసంజూ శాంసన్ను అవకాశం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లుసూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పంత్ కు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దుతు తెలిపారు.
పంత్పై విమర్శలు చేస్తున్నవారు వాటిని కట్టిపెట్టాలని సూచించారు.ధోనితో పోల్చుతూ, అతనికి ప్రత్యామ్నాయం అంటూ పంత్పై ఒత్తిడి తెస్తున్నారు. ధోని కూడా ఒక్కరోజులోనే అవకాశాలు ఒడిసి పట్టుకోలేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలంటే పంత్కు సమయం పడుతుందన్నారు.రిషభ్ పంత్లో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉందన్నారు.కోచ్కానీ, కెప్టెన్ కానీ పంత్కు మెంటార్గా వ్యవహరిస్తే గాడిలో పడితాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.