టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి చ్చాడు. తొలి రెండు టెస్ట్ల్లో విపలమైన రోహిత్..మూడో టెస్టులో అద్భుత సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. ఇక ఈ గెలుపుతో టీమిండియా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-1తో లీడ్లోకి వచ్చింది.
అయితే ఈ గెలుపుతో టీమిండియా సెంటిమెంట్ మరోసారి వర్క్వుట్ అయింది. అదే రోహిత్ శర్మ సెంచరీ. రోహిత్ సెంచరీ చేసిన ప్రతి టెస్టు మ్యాచ్ లోనూ టీమిండియా విజయాన్ని నమోదుచేసింది. ఇప్పటివరకు టెస్టుల్లో 11 సెంచరీలో చేసిన రోహిత్ శర్మ.. అన్నీ మ్యాచుల్లో కూడా టీమిండియా విజయకేతనం ఎగురవేసింది.
ఇక రోహిత్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే…సౌతాఫ్రికాపై 3, ఇంగ్లాండ్ పై 3, వెస్టిండీస్ పై 3, ఆస్ట్రేలియాపై 1, శ్రీలంక పై 1 సెంచరీ చేశారు. ఇక రాంచి వేదికగా ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా ఆ టెస్టులోనూ రోహిత్ సెంచరీ చేయాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.