- Advertisement -
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తల్లి కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయాన్ని స్వయంగా సానియానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.అయితే తల్లిని అయిన తరువాత కూడా తను టెన్నిస్ ఆడతానని ఎటువంటి పరిస్థితులలో ఆటను ఆపబోనని స్పష్టం చేసింది.ప్రతి స్త్రీకి తల్లి కావడం అనేది ఓ అద్భుతం, అదృష్టం. గర్భిణిని కావడంతో బరువు పెరిగిన మాట వాస్తవమే. అయితే అది ఎవరికైనా అంతే. తిరిగి బరిలో దిగితే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పుకొచ్చింది.
తల్లిగా మారాక టెన్నిస్లో రాణించిన వారిలో నా పేరు ప్రముఖంగా వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రస్తుతం నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. అలాగని నాకెంతో ఇష్టమైన ఆటను వదిలేయను. బిడ్డ తర్వాత నేను అధిక ప్రాధాన్యం ఇచ్చేది టెన్నిస్కే అని తెలిపింది.