భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్పై సంచలన వ్యాఖ్యలు చేశారుఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ . సిచిన్ సాధించలేని ఘనతల్ని ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లీ సాధించారని అభిప్రాయ పడ్డారు. ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మెంటార్గా పనిచేస్తున్న షేన్ వార్న్.. యువ క్రికెటర్ల నుంచి అద్భుత ప్రదర్శనని రాబడుతున్నాడు.
ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ క్రికెటర్..? అనే ప్రశ్నరాగా.. షేన్ వార్న్ సమాధానమిచ్చాడు. విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా జట్టు ఛేజింగ్కి దిగిన సమయంలో అతను బాదుతున్న శతకాలు అసాధారణం. క్రికెట్లో సచిన్తో పాటు ఎవరికీ సాధ్యంకాని రీతిలో విరాట్ కోహ్లి అనితర రికార్డుల్ని సొంతం చేసుకున్నాడన్నాడు.
విరాట్ కోహ్లీ అంకితభావం నాకు బాగా నచ్చుతుంది. మరో పదేళ్లు కోహ్లి క్రికెట్ ఆడగలిగితే.. దిగ్గజ క్రికెటర్ సచిన్ సరసన అతను నిలబడతాడు’ అని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో టీమిండియా ఛేదనకు దిగిన సమయంలో విరాట్ కోహ్లి ఇప్పటికే 19 శతకాలు బాదగా.. సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలే చేశారన్నారు.