ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లో పృధ్వీ షా స్ట్రైట్గా షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బంతి బౌలర్ చేయి తగిలి నేరుగా వికెట్లని తాకింది. అప్పటికి క్రీజు వెలుపల ఉన్న ఓపెనర్ మాక్స్వెల్ వేగంగా వెనక్కి రాలేకపోవడంతో అతను రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది.
సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. సన్రైజర్స్ ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు సాధించింది.అదే సమయంలో ఢిల్లీ తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడు విజయాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సన్రైజర్స్ తుది జట్టులోకి భువనేశ్వర్ తిరిగి రాగా, బాసిల్ థంపికి విశ్రాంతి కల్పించారు. మరొకవైపు ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నమాన్ ఓజా, డానియల్ క్రిస్టియన్లు జట్టులోకి రాగా, మున్రో, షహబాజ్ నదీమ్లను తప్పించారు.
హైదరాబాద్ జట్టు: అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, సాహా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ
ఢిల్లీ జట్టు: పృధ్వీ షా, నమన్ ఓజా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మాక్స్వెల్, విజయ్ శంకర్, క్రిస్టియాన్, ఫ్లంకెట్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్