ప్రపంచకప్లో సౌతాఫ్రికా ఎట్టకేలకు విజయం సాధించింది పరువు నిలుపుకుంది. శ్రీలంకతో చెస్టర్ లీ స్ట్రీట్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో అన్నిరంగాల్లో రాణించిన సఫారీలు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆమ్లా 80 పరుగులు, డూప్లెసిస్లు 96 పరుగులు,అర్థసెంచరీలు చేయడంతో సునాయాసంగా విజయం అందుకొంది. జట్టును 37.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు.దీంతో లంక సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.
మొదట లాస్ గెలిచి లంకను బ్యాటింగ్కు ఆహ్వానించారు సపారీలు. ప్రొటీస్ పేసర్లు ప్రిటోరియస్ (3/25), మోరిస్ (3/46), రబాడ (2/36) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన లంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. కుషాల్ పెరెరా (30; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (30; 4 ఫోర్లు) మినహా మిగిలినవారు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు.
అనంతరం లక్ష్య ఛేదనలో అనంతరం దక్షిణాఫ్రికా 37.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (103 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), హషీం ఆమ్లా (105 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లుతో నిలి చారు. ప్రిటోరియస్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.