Thursday, April 25, 2024
- Advertisement -

గాయపడ్డ డుప్లెసిస్​.. ఆస్పత్రిలో చేరిక.. ఫ్యాన్స్​లో టెన్షన్

- Advertisement -

బౌండరీ లైన్​ దగ్గర మరో క్రికెటర్​ను ఢీకొట్టి.. దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆటగాడు డుప్లెసిస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తమ అభిమాన క్రికెటర్​ కు గాయాలు కావడంతో ఫ్యాన్స్​ వర్రీ అవుతున్నారు. డుప్లెసిస్​ వెంటనే కోలుకోవాంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం అబుదాబిలో పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. షేక్‌ జాయెద్‌ స్టేడియంలో పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. ఈ క్రమంలో డుప్లెసిస్​ బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి అడ్డుకునే క్రమంలో మరో ఆటగాడు మహమ్మద్‌ హస్‌నెయిన్‌ను ఢీ కొట్టాడు. డుప్లెసిస్ తలకు హస్ నెయిన్ మోకాలు బలంగా తగిలింది. దీంతో అతడు అక్కడే కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Also Read: కమల్​ను ఇండియన్​ -2 శనిలా వెంటాడుతోంది? మధ్యేమార్గంగా ప్లాన్​చేసిన కమల్​..!

ప్రస్తుతం డుప్లెసిస్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జి అయినట్టు సమాచారం. ఇప్పుడు హోటల్​ గదిలో రెస్ట్​ తీసుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్‌ ఓటమి పాలైంది. డుప్లెసిస్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అందువల్లే అతడికి ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు వారంతా డుప్లెసిస్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read: బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -