Saturday, May 18, 2024
- Advertisement -

ఫెర్నాండో అద్భుత సెంచ‌రీ….338 ప‌రుగుల భారీ స్కోరు చేసిన శ్రీలంక‌..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన లంక‌ నామ‌మాత్ర‌పు మ్యాచ్ లో విండీస్‌పై లంక భారీ స్కోరు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి తేలిపోతున్న లంక బ్యాట్స్‌మెన్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మెరిశారు.యువ హిట్టర్ ఫెర్నాండో (104: 103 బంతుల్లో 9×4, 2×6) బాధ్యతాయుత శతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ జట్టులో హోల్డర్ రెండు వికెట్లు, కాట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ పడగొట్టారు.

కుశాల్ పెరీరా(64: 51 బంతుల్లో 8ఫోర్లు) అర్ధశతకంతో విజృంభించడంతో లంక ఈజీగా భారీ స్కోరు చేసింది. లంక బ్యాట్స్‌మెన్‌లో దిముత్ కరుణరత్నె(32), కుశాల్ మెండీస్(39), తిరుమానె(45 నాటౌట్), మాథ్యూస్(26) ఫర్వాలేదనిపించారు. దీంతో 50 ఓవర్లలో లంక 6 వికెట్లకు 338 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ఓపెనర్ల జోడీ కరుణరత్నె, కుశాల్ పెరీరా 93 పరుగులు జోడించారు. అయితే.. 11 పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటవగా.. అనంతరం వచ్చిన ఫెర్నాండో క్రీజులో పాతుకుపోయి ఆఖరి వరకూ శ్రీలంక ఇన్నింగ్స్‌‌ని నడిపించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -