- Advertisement -

దిత్వా తుఫాన్‌.. అతలాకుతలం

- Advertisement -

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం సైక్లోనిక్ తుఫాను దిత్వా తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతోంది. నవంబర్ 30వ తేదీ ఉదయం ల్యాండ్‌ఫాల్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను శుక్రవారం ఉదయం శ్రీలంక తూర్పు తీరాన్ని ఢీకొని, భారీ విధ్వంసం సృష్టించింది. వరదలు, కొండచరియల విరిగిపడటం వంటి ఘటనల్లో 120 మందికి పైగా మరణించారు. ప్రభావిత ప్రాంతాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

ఈ తుఫాను ప్రస్తుతం సైక్లోనిక్ స్టార్మ్‌గానే కొనసాగుతోంది. మరింత బలపడే సూచనలు లేవని IMD తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

శ్రీలంకలో తుఫాను ప్రభావిత భారతీయుల సహాయార్థం కొలంబోలోని బండారనాయికే అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
శ్రీలంకలో ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు:+94 773727832 (వాట్సాప్‌లో కూడా అందుబాటులో ఉంది)

విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులకు ఆహారం, నీరు వంటి అవసరమైన సహాయం అందిస్తున్నారు. సైక్లోన్ దిత్వా గత ఆరు గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం మరియు సమీప బంగాళాఖాత ప్రాంతంలో కేంద్రికృతమై ఉంది.

రామనాథపురంలో శుక్రవారం భారీ గాలులు, ఉధృత వర్షాలు, అలలతో కూడిన వాతావరణం కనిపించింది. సైక్లోన్ దిత్వా నవంబర్ 30 ఉదయంలో తీరం దాటే అవకాశం ఉంది. శ్రీలంక ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తుఫాను బాధితుల కోసం ప్రార్థించారు. సైక్లోన్ దిత్వా కారణంగా శ్రీలంకలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల నా హృదయపూర్వక సంతాపాలు. ప్రభావిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆపరేషన్ సాగర్-బంధు కింద భారత్ అత్యవసర సహాయం పంపింది. పరిస్థితిని బట్టి మరిన్ని సహాయాలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పారు.

IMD తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 29–డిసెంబర్ 1: తీర ఆంధ్రప్రదేశ్ & రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘దిత్వా’ అనే పేరు యెమెన్ సూచించింది. సోకోత్రా ద్వీపం వాయువ్య భాగంలోని దెట్వా సరస్సు (లగూన్) పేరు నుండి వచ్చినదిగా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -