- Advertisement -
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది. ఇంగ్లండ్ లో రోడ్డుప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్ తర్వాత గవాస్కర్ ఆదివారం మాంచెస్టర్ నుంచి లండన్ కు వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన కారు వీరి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వారు ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది.
కారు వెనుక సీట్లో ఎడమవైపున గవాస్కర్ కూర్చొగా, కుడివైపున మరో కామెంటేటర్ మార్క్ నికోలస్ ఉన్నారు. వీరిద్దరితో పాటు డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డాడు. దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు