- Advertisement -
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆలౌట్ కాగా 163 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు.
విరాట్ కోహ్లీ ఒక్కడే 76 పరుగులతో రాణించగా గిల్ 26,జైస్వాల్ 5,రోహిత్ శర్మ 0,శ్రేయాస్ అయ్యర్ 6,కేఎల్ రాహుల్ 4,అశ్విన్ 0,ఠాకూర్ 2 విఫలమయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓటమి పాలైంది.
సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లలో ఓపెనర్ డీన్ ఎల్గన్ 287 బంతుల్లో 28 ఫోర్లుతో 185 పరుగులు చేసి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్సయ్యాడు. సౌతాఫ్రికా గడ్డపై 2010 లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు మరోసారి చెత్త ఓటమిని మూటగట్టుకుంది.