టీమిండియా మళ్లీ సత్తాచాటింది. ఇంగ్లాండ్తో సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకోవడంతో టెస్టు ర్యాంకింగ్స్లో తిరిగి ఫస్ట్ ప్లేస్కు చేరింది. ఈ సిరీస్కు ముందు టెస్టుల్లో 5వ స్థానంలో ఉండగా వరుసగా నాలుగు విజయాలతో 122 పాయింట్లు దక్కించుకుని టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లో నెంబర్ 1గా నిలిచింది టీమిండియా.
ఇలా మూడు ఫార్మాట్లలో టీమిండియా టాప్ ప్లేస్లో చాలా సార్లే నిలిచింది. ఇక వన్డే ర్యాంకింగ్స్ లో గిల్, విరాట్ కోహ్లీ మొదటి రెండు స్థానాల్లో ఉండగా టీ20 లలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో అశ్విన్ నెంబర్ 1గా ఉండగా బుమ్రా మూడో స్థానంలో ఉన్నారు.
వన్డే ర్యాంకింగ్స్లో భారత పేసర్లు సిరాజ్, బుమ్రా నాలుగు,ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక టీ20ల్లో అక్షర్ పటేల్ నాలుగో స్ధానంలో ఉండగా ఇలా అన్ని ఫార్మాట్లలో భారత ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. త్వరలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుండగా అనంతరం జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది.