Tuesday, April 30, 2024
- Advertisement -

ఐదో టీ20లోనూ టీమిండియా గెలుపు

- Advertisement -

ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. నామమాత్రమైన చివరి టీ20లో సూర్యకుమార్ సేన 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.భారత్ విధించిన 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్..20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది.

మెక్‌ డర్మాట్‌ (54; 5 సిక్సర్లు) హాఫ సెంచరీతో రాణించగా ట్రావిస్‌ హెడ్‌ (28), కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (22) రాణించగా మిగితా ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ 3, అర్ష్‌దీప్‌, రవి బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 37 బంతుల్లో 53,అక్షర్‌ పటేల్‌ (31), జితేశ్‌ శర్మ (24), యశస్వి జైస్వాల్‌ (21) రాణించారు. అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు, యువ స్పిన్నర్‌ రవికి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -