Thursday, April 18, 2024
- Advertisement -

సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ లోకి ఎంట్రీ..సేఫ్టీ వరల్డ్​ సిరీస్​కు షెడ్యూల్​ ఖరారు..!

- Advertisement -

క్రికెట్​ లెజెండ్స్​ ఆడనున్న రోడ్​ సేఫ్టీ వరల్డ్​ సిరీస్​కు షెడ్యూల్​ ఖరారైంది. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న సిరీస్​ తొలి మ్యాచ్​లో ఇండియా లెజెండ్స్​, బంగ్లాదేశ్​ లెజెండ్స్​ టీమ్​లు తలపడనున్నాయి. అదే విధంగా మార్చి 7న ఇంగ్లాండ్​ లెజెండ్స్​, బంగ్లాదేశ్​ లెజెండ్స్​ జట్లు పోటీ పడనున్నాయి.

ఈ సిరీస్​లోని​ సెమీఫైనల్​ మ్యాచ్​లను మార్చి 17, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. మార్చి 21న తుదిపోరు జరగనుంది. గతేడాది జరిగిన ఈ టీ20 ఫార్మాట్​ సిరీస్​ తొలి ఎడిషన్​ కరోనా కారణంగా (మార్చి 11న) మధ్యలోనే ఆగిపోయింది.ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్​ వీర్​ నారాయణ్​​ సింగ్ అంతర్జాతీయ క్రికెట్​ స్డేడియం ఈ సిరీస్​కు వేదిక కానుంది. కేంద్రం విడుదల చేసిన కొవిడ్​ మార్గదర్శకాలను అనుసరిస్తూ.. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు.

ఈ సిరీస్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారాతో పాటు ముత్తయ్య మురళీధరన్, తిలకరత్నె దిల్షాన్, బ్రెట్ లీ సహా భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ దేశాలకు చెందిన పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొననున్నారు.

మళ్ళీ స్టేడియంలోకి అడుగు పెడుతున్న వార్నర్.. డాక్టర్స్ వద్దన్న నేను బ్యాట్ పడతాను..!

స్టూడెంట్స్ ఎమోషన్… వైఎస్ షర్మిళా రియాక్షన్…

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -