వెండితెరపై చెరగని ముద్రవేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ షూటింగ్ పూర్తయి. విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ తన కెరియర్లో అధిక భారీ బడ్జెట్ మరో సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఈ చిత్రన్ని విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందిస్తుండగా.. పవన్ సినీ ప్రస్థానంలో బ్లక్ బస్టర్ మూవీ ఖుషీని అందించిన ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్శిస్తున్నారు.
ఈ చిత్రం గురించి మీడియాలో పెద్దగా హడావిడి కనిపించడం లేదు. కానీ పవన్ సినీ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా రెండు శతాబ్దాల కిందటి కథాంశంతో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతోంది. కాగా, ఈ చిత్రానికి హరిహర వీరమల్లు అనే టైటిల్ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకుంటే ఇటీవలే ఈ టైటిల్ను చిత్ర యూనిట్ రిజిస్టర్ చేసింది.
ఈ చిత్రంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతోందని అన అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే, ఈ మూవీలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడని టాక్. అలాగే, బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగా జేబు పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈసినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో చార్మినార్ భారీ సెట్ వేశారు. ఇందులో ఓల్డ్ సిటీకి చెందిన పహిల్వాన్లు పెద్ద ఎత్తున్న పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !