Friday, May 17, 2024
- Advertisement -

నేడు ఇంగ్లండ్‌తో రెండో వన్డే

- Advertisement -

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భార‌త్ జ‌ట్టు మొద‌టి వ‌న్డేలో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.ఇప్పుడు మరో విజయం సాధించి వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకునే క్రమంలో కచ్చితంగా మ్యాచ్‌ నెగ్గాల్సిన స్థితిలో మోర్గాన్‌ సేన నిలిచింది. ఈ నేపథ్యంలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. వన్డేల్లో రికార్డు విజయాలతో ఊపు మీద కనిపించిన ఇంగ్లండ్‌ ఒక్కసారిగా భారత్‌ దెబ్బకు నేలకు దిగొచ్చింది.

రోహిత్‌ తిరుగులేని ఆటను ప్రదర్శిస్తుండగా, కోహ్లి ఆట గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాని సురేశ్‌ రైనా, ధోని, హార్దిక్‌ పాండ్యా ఈసారి చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో బాగా బలహీనంగా కనిపిస్తున్న ఇంగ్లండ్‌ తుది జట్టులో ఏమైనా మార్పులు జరుగుతాయా చూడాలి. మరో 33 పరుగులు చేస్తే వన్డేల్లో ధోని 10 వేల పరుగులు పూర్తవుతాయి.మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం మ్యాచ్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -