- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ఈరోజు రాత్రి నుంచే మొదలవనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్కు క్రికెట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లకి చెందిన టాప్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఫిటెనెస్, ఫామ్లేమీ కారణంగా కొంత మంది టాప్ క్రికెటర్లు, హిట్టర్లు సైతం ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నారు.
దురదృష్టవంతుల జాబితాలో హసీమ్ ఆమ్లా, జో రూట్, మార్టిన్ గప్తిల్, లసిత్ మలింగ లాంటి టాప్ క్రికెటర్లు ఉండగా.. మిచెల్ స్టార్క్, కాగిసో రబాడ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. బాల్ టాంపరింగ్ వివాదంతో స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్లపై ఏడాది నిషేధం వేటు పడటంతో వారూ దూరమయ్యారు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రజాదారణ పొందిన ఐపీఎల్లో ఆడలేకపోవడం కచ్చితంగా ఆ క్రికెటర్లని బాధించే అంశమే.