సెలబ్రిటీలు సోషియల్ మీడియాలో ఏ పోష్ట్లు పెట్టినా అది వైరల్ అవడం సహజం. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో తన సతీమణి సాక్షి, కూతురు జీవాతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఓ వీడియోను ధోని తన ఇన్స్టాగ్రాంలో ‘ఫన్ టైం విత్ ఫ్యామిలీ’ అనే క్యాఫ్షన్తో పంచుకున్నాడు. అయితే ఈ వీడియోలో తన పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలంటే ధోనికి ఎంతో ఇష్టమనే విషయం అందరికి తెలిసిందే.
ధోనీ తన కూతురు జీవాను ఒళ్లో కూర్చుబెట్టుకోగా, భార్య సాక్షి అతని పక్కనే కూర్చుని ఉండటం, ధోనీ తన చేతిలోని బాల్ విసిరి వేయగానే పెంపుడు శునకాల్లో ఒకటి తన నోటితో దానిని పట్టుకునే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాగా, ఐపీఎల్ నిర్వాహకులు నిన్న విడుదల చేసిన ప్రచార గీతాన్ని ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు.
https://www.instagram.com/p/BgQGYLMnVpF/?taken-by=mahi7781