వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ ఫీట్ని సాధించాడు. వన్డేల్లో 50వ సెంచరీని సాధించి సచిన్ రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకు సచిన్ పేరుపై ఈ రికార్డు ఉంది. సచిన్ 49 సెంచరీలు చేయగా విరాట్ దానిని అధిగమించి 50 సెంచరీలు చేశాడు. సచిన్ 452 మ్యాచ్ల్లో 49 సెంచరీలు చేయగా విరాట్ కేవలం 271 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు.
రోహిత్ శర్మ 31 సెంచరీలతో తర్వాతి స్ధానంలో ఉండగా రికీ పాంటింగ్ 30,సనత్ జయసూర్య 28 ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా సచిన్ ఇంకా టాప్లోనే ఉన్నాడు. సచిన్ 100 సెంచరీలతో ఉండగా విరాట్ 80, పాంటింగ్ 71,సంగక్కర 63, కలిస్ 62 సెంచరీలతో ఉన్నారు.
వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.