Monday, May 13, 2024
- Advertisement -

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాన్ని కోల్పోయిన విరాట్ కోహ్లీ…..

- Advertisement -

ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రాల ర్యాంకింగ్‌లు ప‌డిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కు టాప్ స్థానంలో ఉన్న ఈ ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం మూడో ర్యాంక్‌కి ప‌డిపోయారు. బ్యాట్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియ‌న్ ఓపెనర్ ఆర‌న్ ఫించ్‌, పాకిస్థానీ స్పిన్న‌ర్ ఇమాద్ వాసిమ్‌లు మొద‌టి రెండు ర్యాంకుల్లో నిలిచారు.

అయితే విరాట్ పెళ్లి కార‌ణంగా శ్రీలంక‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న ర్యాంకు ప‌డిపోయింది. అయిన‌ప్ప‌టికీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ వ‌రుస‌గా మొద‌టి, రెండో స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

ఇక శ్రీలంక‌తో జ‌రిగిన టీ20లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన లోకేష్ రాహుల్‌, రోహిత్ శ‌ర్మ‌ల ర్యాంకులు మెరుగుప‌డ్డాయి. రాహుల్ నాలుగో స్థానంలో, రోహిత్ శ‌ర్మ 14వ స్థానానికి చేరుకున్నారు. బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఆట‌గాడు ఇమాద్ వాస్లం, ఆఫ్ఘ‌నిస్తాన్ ఆట‌గాడు ర‌షీద్ ఖాన్‌లు మొద‌టి, రెండు స్థానాల్లో నిలిచారు. టాప్ 15లో నిలిచిన ఏకైక భార‌తీయ‌ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మాత్ర‌మే ద‌క్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -