సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు ముందు ఆర్సీబీ ఆటగాళ్లు క్రికెటర్ సిరాజ్ ఇంట్లో సందడి చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు పార్థీవ్ పటేల్, మన్దీప్ సింగ్లు సిరాజ్ ఇంట్లో బిర్యానీ రుచి చూశారు. మ్యాచ్ కోసం ఆదివారం కోహ్లి సేన హైదరాబాద్కు చేరుకుంది. సాయంత్రం వరకు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన ఆనంతరం.. కోహ్లితో పాటు కొందరు ఆర్సీబీ ఆటగాళ్లు టోలిచౌక్లోని సిరాజ్ ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన సిరాజ్ని ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో బెంగళూరు జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ క్రికెటర్ అయిన సిరాజ్ గతేడాది సన్రైజర్స్ తరఫున ఆడగా.. ఈ ఏడాది బెంగళూరు తరఫున బరిలో దిగుతున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్రైజర్స్తో కోహ్లిసేన సోమవారం రాత్రి కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది.