- Advertisement -
ఇంగ్లాండ్తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ ముందు భారత్ 399 పరుగుల టార్గెట్ని విధంచగా ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి 67 పరుగుల వద్ద ఉంది. ఇంకా గెలుపు కోసం 332 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక రెండు రోజుల ఆట మిగిలి ఉండగా టీమిండియా 9 వికెట్లు తీయాల్సి ఉంది. అయితే ఛేజింగ్ అంతా ఈజీ కాదు. కానీ ఒకవేళ ఇంగ్లాండ్ టార్గెట్ చేజ్ చేస్తే చరిత్ర తిరగరాస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు ఇంత బారీ లక్ష్యాన్ని చేధించలేదు.
భారత్ లో ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో 250కి పైగా పరుగుల చేధన కేవలం ఐదు సార్లు మాత్రమే జరిగింది. అందులో నాలుగు సార్లు టీమిండియా ఒక సారి వెస్టిండీస్ పేరు మీద ఉంది. ఒక ఇంగ్లాండ్ గెలిస్తే హిస్టరీ క్రియేట్ కానుండగా టీమిండియా మాత్రం ఉప్పల్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.