సౌరభ్ గంగూలీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసిస్ చేతిలో ఓడిన సంగతి తెలిసే ఉంటుంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతీరు కనబర్చిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ప్రతి జట్టుపై ఆధిపత్యం చెలాయించిన భారత్ ఆసీస్తో జరిగిన ఫైనల్లో తడబడింది.
అప్పటి జట్టుకు నాయకత్వం వహించింది సౌరభ్ గంగూలీనే. చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది . అలాంటి టోర్నీలో ధోనీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ధోనీని వెలుగులోకి తెచ్చింది గంగూలీ అనే సంగతి తెలిసిందే. 2004లో అతడు భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు.
టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్న సమయానికి ధోనీ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నమ్మకలేకపోతున్నా అని తన ఆటోబయోగ్రఫీ ‘వన్ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్’లో రాసుకొచ్చాడు. మహీ విషయంలో నా అంచనా నిజమైంది. తొలి రోజు నుంచే అతడి ఆటతీరు నన్ను ఆకట్టుకుంది. ధోనీ ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగాడని దాదా సంతోషం వ్యక్తం చేశాడు. అతడు ఈ రోజేంటో అందరికీ తెలిసిందే. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.