కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ఓపెనర్ జాసన్ రాయ్ అద్భుత సెంచరీతో రాణించి మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. రాయ్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 153 పరుగులు చేసి అలరించాడు. అయితే మ్యాచ్లో ఓఅసక్తికరమనైన సంఘటన చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్తో కార్డిఫ్ వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్లో మెరుపు శతకం బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (153: 121 బంతుల్లో 14×4, 5×6) ఏమరపాటులో ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ని ఢీకొట్టేశాడు. దీంతో.. అంపైర్ కిందపడిపోగా.. వెంటనే జేసన్ రాయ్ అతడ్ని పైకిలేపాడు. అంపైర్కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
సెంచరీ దగ్గరలో జేసన్ రాయ్ ముస్తాఫిజుర్ బౌలింగ్లో బంతిని డీప్ స్వేర్ లెగ్ దిశగా హిట్ చేశాడు. అయితే పీల్డర్ ఆన్ని వదిలేయడంతో బౌండరీ లైన్ను దాటింది. తరువాతబంతిని హిట్ చేసిన జేసన్ రాయ్.. దాన్ని చూస్తూ నాన్స్ట్రైక్ ఎండ్వైపు పరుగెత్తాడు. ఫీల్డ్ అంపైర్ జోయల్ విల్సన్ కూడా ఆ బంతిని చూస్తూ.. వికెట్ల నుంచి పక్కకి జరిగేందుకు ప్రయత్నిస్తుండగా.. జేసన్ రాయ్ అతడ్ని వేగంగా వచ్చి ఢీకొన్నాడు. దీంతో.. జోయల్ విల్సన్ నేలపై పడిపోతుండగా.. ఆఖరి క్షణంలో రాయ్ అతడ్ని పట్టుకునేందుకు ట్రై చేశాడు.