త్వరలో ప్రపంచకప్ ఆరంభం.. మరోవైపు అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్లతో మంచి జోరుమీదున్నారు. తమ ఆదాధ్య క్రికెటర్లపై పలు రకాల పోస్టర్లలో తమ అభిమానం తెలుపుతుంటారు. తాజాగా పాకిస్థాన్కి చెందిన ధోనీ వీరాభిమాని షెజాద్ ఉల్ హసన్.. ఏకంగా పాక్ జెర్సీపైనే ధోనీ పేరు, నెం.7 వేయించి తన ప్రేమని చాటుకున్నాడు. ఇలా ఒక పాకిస్తాన్ అభిమాని ధోని పేరుతో జెర్సీ తయారు చేయించుకోవడం గతంలో చూసిన సందర్భాలు లేవు.
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న ఢీకొననున్నాయి. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. పాక్తో మ్యాచ్ని భారత్ బహిష్కరించాలని విమర్శులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్లు మాత్రం మ్యాచ్ ఆడి గెలిచి అమర జవాన్లకి ఘన నివాళి అర్పించాలని సూచించింది. నాలుగు దశాబ్దాలుగా ప్రపంచకప్లో పాకిస్తాన్ తలపడిన ప్రతీసారీ భారత్దే విజయం కావడం విశేషం. దీన్ని మరోసారి పునరావృతం చేయాలని విరాట్ సేన భావిస్తోంది.